నిరుపేదలకు వరప్రదాయని ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Friday April 30, 2021

పటాన్ చేరు, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరప్రదాయినిగా నిలుస్తోందని పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం మండలాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు మంజూరైన 7 లక్షల 53 వేల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఖర్చుతో కూడుకున్న శస్త్ర చికిత్సల సమయంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎల్ ఓసిలు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.