బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు అనంతాచార్యులు కి ఘన సన్మానం

Published: Tuesday March 08, 2022
మధిర మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం రాయపట్నం గ్రామంలో సోమవారం నాడు మధిర బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న అనంతాచార్యులు వారికి రాయపట్నం ప్రజలు ఈరోజు ఘనంగా సన్మానించారు రాయపట్నం ఆలయ ప్రతిష్ట విజయవంతంగా ముగిసిన సందర్భంగా పదోరోజు పండగ నిర్వహించారు ఈ సందర్భంగా అనంతాచార్యులు గారికి సువర్ణ కంకణం వేసి దంపతులకు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు