పట్టాలు లేని నిరుపేదలకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Thursday March 31, 2022

జగిత్యాల, మార్చి, 30 (ప్రజాపాలన ప్రతినిధి): టీ ఆర్ నగర్ అంగన్వాడీ కేంద్రం, తారక రామ పార్కును పరిశీలించి అనంతరం పట్టాలు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భరోసా కల్పించినారు. అంగన్వాడీ కేంద్రం లో చిన్నారులకు మౌళిక వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకుని వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి చిన్నారులతో కాసేపు గడిపారు. అనంతరం టి ఆర్ నగర్ లో ఎలాంటి పట్టాలు లేకుండా ప్రభుత్వ భూమిలో నివాసం ఏర్పరచుకున్న నిరుపేదలు ఎమ్మేల్యే ని కలిసి పట్టాలు ఇప్పించాలని కోరగా జీఓ 58 ప్రకారంగా సంబంధిత ఆధారాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించినారు. అనంతరం టి ఆర్ నగర్ తారకరామ ప్రకృతి వనాన్ని సందర్శించి పట్టణ వాసులు ప్రతి ఒక్కరూ వచ్చి పిల్లలతో వచ్చి వీక్షించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చాంద్ పాషా, పట్టణ యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, నాయకులువిఘ్నేష్, బాబా గౌడ్, సుమన్, ప్రశాంత్, మురళి తదితరులు ఉన్నారు.