పార్లమెంట్లో బి సి రిజర్వేషన్ బిల్ పెట్టాలని నిరసన

Published: Wednesday December 15, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 14, ప్రజాపాలన : పార్లమెంట్లో బిసి రిజర్వేషన్ బిల్ పెట్టాలని కోరుతూ తెలంగాణ బిసి జాగృతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకొని మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పార్లమెంటు సమావేశంలో బిసి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, యువ జాగృతి నాయకుడు మచ్చర్ల సదానందం, పట్టణ ప్రచార కార్యదర్శి నగునూరి లక్ష్మణ్, కీర్తీ రవి, కీర్తి రమేష్, రాజేందర్, దుర్గం స్వామి, దుర్గం దామోదర్, గుడిసెల నాని, పారి పెళ్లి శేఖర్, బండ రవి, తదితరులు పాల్గొన్నారు.