పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం

Published: Tuesday March 09, 2021
మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం (ప్రజా పాలన) : నెల్లికుదురు మండల కేంద్రంలో సీనియర్ ఓటర్ కురియావుల కృష్ణయ్య ను సన్మానం చేసి సన్మానం తో పాటు పాదాభివందనం చేసి ఎమ్మెల్సీ ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తొర్రూర్ మార్కెట్ వైస్ చైర్మన్ జిలుకర యాలాద్రి ఓటర్లను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి పట్ట భద్రుని కలిసి టిఆర్ఎస్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను నిలబెట్టుకున్న టువంటి వాగ్దానాలను నిరంతర విద్యుత్ వ్యవస్థను నిరుద్యోగ భర్తీ లను పట్టభద్రులకు చెప్తూ మీ ఓటును వృధా చేయకుండా అభివృద్ధి మార్గంలో ముందంజలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి వేసి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ పట్టభద్రులు జ్ఞానవంతులు తెలివైనవారు కాబట్టి వారి ఓటును విలువగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్న దిశలో అభివృద్ధి రైతాంగానికి  చేసేటటువంటి రైతుబంధు అలాంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభివృద్ధిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరారు