మేడికో సూసైడ్ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన శ్యామ్ నాయక్
Published: Monday February 27, 2023
జన్నారం, ఫిబ్రవరి 26, ప్రజాపాలన: నిజామాబాద్ లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన దాసరి హర్ష (22) ఆ కుటుంబం ఇంటికి వెళ్లి టీఎన్జీవో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్ నాయక్ పరామర్శించారు. ఆదివారం దాసరి హర్ష కు సొంత గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అయితే హర్ష తల్లి రాధా వినిపిస్తూ కన్న కొడుకు చితికి నిప్పు పెట్టి దహన సంస్కరణలను పూర్తి చేశారు. ఆ తల్లిని చూసి ఆ గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. ఆత్మహత్య చేసుకున్న హర్ష అంత్యక్రియలకు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చింతగూడ గ్రామానికి చెందిన దాసరి రాధా శ్రీనివాస్ లకు ఇరువురు కుమారులు అందులో పెద్దవాడు హర్ష, దాసరి హర్ష తండ్రి దాసరి శ్రీనివాస్ బ్రతుకుతెరువు కోసం 45 రోజుల క్రితమే మలేషియా వెళ్లరు. రూమ్ లో హర్ష ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయమైనది. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియ రాలేదు. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ నిజామాబాదులో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మెడికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇలా ఆత్మహత్య చేసుకోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ఇతరులు పాల్గొన్నారు.
Share this on your social network: