జగిత్యాల జిల్లా కేంద్రంలో తెరాస భారీ ర్యాలీ ఊరేగింపు...

Published: Thursday February 03, 2022

ఎమ్మెల్సీ ఎల్.రమణ తెరాస జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు భారీ సన్మానం

జగిత్యాల, ఫిబ్రవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల ఎన్నికైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ జగిత్యాల తెరాస జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు జిల్లా నాయకులు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ఎమ్మెల్యేలు డా: సంజయ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొండగట్టు వద్ద స్వాగతం పలికి జగిత్యాల కొత్త బస్టాండ్ నుండి టవర్ తహశీల్ చౌరస్తా వరకు ఊరేగింపుగా చేసి అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ముగించారు. అనంతరం పద్మనాయక పంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా తెరాస కార్యకర్తల సమావేశంలో సంక్షేమ మంత్రి ఈశ్వర్ జిల్లా అధ్యక్షుడైన కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పార్టీ పటిష్టకు అంకిత భావంతో పని చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందే విదంగా ఎల్లప్పుడు కృషి చేస్తూ అందుబాటులో ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చురుకైన కార్యకర్తగా పని చేయాలని విద్యాసాగర్ రావుతో మంత్రి కొప్పుల  ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చనాలతో ఆశీర్వదించి ఘనంగా శాలువలతో సన్మానించారు. అనంతరం మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందరికి అందేవిదంగా మరియు ప్రతి కార్యకర్త పార్టీ పతిష్ఠకు ఒక సైనికునిగా పని చేయాలని కార్యకర్తల సమావేశంలో సూచించారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ ఛైర్మన్ గొడిసెల రాజేశం గౌడ్ గ్రంధాలయ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఎఎంసి ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్లు మోర హన్మండ్లు బోగ శ్రావణి హరి చరణ్ రావు లోక బాపురెడ్డి సుధాకర్ రావు గట్టు సతీష్ ఎంపిపిలు జడ్పీటీసీలు వార్డు కౌన్సిలర్లు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.