సర్దార్ పటేల్ జయంతి ఏక్తా దివస్ ప్రతిజ్ఞ : ఎస్పీ సిందూశర్మ
Published: Monday November 01, 2021
జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిందూశర్మ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిజ్ఞలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను సమగ్రతను మరియు భద్రతను కాపాడడానికి నన్ను నేను అంకితం చేస్తు మరియు నా తోటి ప్రజల్లోకి ఈ సందేశాన్ని పంపడానికి నా వంతు కృషి చేస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పి సురేష్ ఆర్ఐ వామన మూర్తి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: