*పాషా,నరహరి గార్ల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాం* *సిపిఐ (యం)*
Published: Thursday October 27, 2022
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ(యం) పార్టీ రంగారెడ్డి జిల్లా ఉద్యమ నిర్మాతలు, బడుగు బలహీనత వర్గాల ఆశాజ్యోతులు కామ్రేడ్ మహబూబ్ పాషా,నరహరి గార్ల 33వ వర్ధంతి కార్యక్రమాన్ని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భూమి కోసం,భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం పేద ప్రజలను ఏకం చేసి పోరాటాలు నడుపుతుంటే ఆ పోరాటాలను చూసి ఓర్వలేక ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని దొరలు, భూస్వాములు మాటుగాసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. భౌతికంగా వారిని ప్రజల నుండి
వారందించిన విప్లవ స్ఫూర్తినితో ప్రజాపోరాటాలను ముందుకు తీసుకెళ్తామని సిపిఎం శ్రేణులు శపథం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి. నర్సింహా, ఐ.భాస్కర్, బి.శంకరయ్య, కే.సత్యనారాయణ, మాల్యాద్రి, అంజి, శ్రీను, సాయి, సాయిరాం, కృష్ణ, తదితులున్నారు
Share this on your social network: