టిఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులనే గెలిపించండి : చిలుక సంతోష్

Published: Saturday March 13, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి12, ప్రజాపాలన : మాదిగల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బలపరిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మాదిగల అంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసి వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి మాదిగ జేఏసి శ్రేణులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా మాదిగ జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిలక సంతోష్ మాట్లాడుతూ డాక్టర్ పిడమర్తి రవి పిలుపుమేరకు మాదిగలు అంతా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని  జిల్లా, రాష్ట్ర కార్యకర్తలకు చూసించారు. రానున్న రోజుల్లో మాదిగలకు టిఆర్ఎస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని ఆయన తెలియజేశారు. మాదిగల సత్తా ఏంటో ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూపించి అన్నారు.