బూర్గంపాడు మండలంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో

Published: Thursday September 29, 2022

 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.

మొరంపల్లి బంజర గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు మొరంపల్లి బంజర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి సుమారు 150 కుటుంబాలు సీఎం కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరారు, వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతున్నదని అన్నారు, ప్రధానమంత్రి మోడీ , పాలనలో దేశం అన్ని రంగాలలో వెనకబడిపోతుందని అన్నారు. ప్రస్తుతరణంలో సీఎం కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరమని ప్రజలు మనసారా ఆశీర్వదించాలని కోరారు., దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా ,ఇస్తున్నారని అన్నారు., వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తుంటే కేంద్రం మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ కార్పొరేట్ దాఖానాలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్ది పేదలకు వైద్య సేవలను అందిస్తుందని, కెసిఆర్ కిట్టు ద్వారా మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు అందిస్తున్నారు అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ గారి పాలనే శ్రీరామరక్షాని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటుచేసి విజయవంతంగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంన్నదన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు అందించాలని సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి రక్షిత మంచినీరు అందిస్తున్నారు,సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రు.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది అలా అందించిన ప్రభుత్వ సహకారంతో 30 రకాల వివిధ వ్యాపారాలను చేసుకుని జీవితంలో ఎదగాలనే సంకల్పంతో తోడ్పాటు ను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటుందన్నారు, బిజెపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఏంటి సంక్షేమ పథకాల అమలు చేయడం లేదన్నారు బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దు అన్నారు, ప్రధానమంత్రి మోదీ ఈ పథకాలన్నీ ఎత్తువేయాలని ప్రమాణాన్ని తయారు చేస్తున్నారని అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉచితాలు బందు చేయాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, స్థానిక ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, నియోజవర్గ వర్కింగ్ యూత్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, టిఆర్ఎస్ నాయకులు సానికొమ్ము శంకర్ రెడ్డి, మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి, గాది నర్సిరెడ్డి, ఎక్కంటి శ్రీనివాస్ రెడ్డి, కైపు సుబ్బరామిరెడ్డి, చేతుల పెద వీరాజు,బిట్రా సాయిబాబా చుక్కపల్లి బాలాజీ, సర్పంచులు కుంజా చిన్నబ్బాయి, భూక్య శ్రావణి, భూక్య భారతి, రెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఎడమ కంటి ఝాన్సీ లక్ష్మి, తోటమల్ల సరిత, నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు