టిఎస్ రాష్ట్ర యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడిగా తెనుగు నర్సింలు

Published: Monday May 03, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : రాజకీయాలకు అతీతంగా నియమనిబంధనలు పాటిస్తూ, జాతి సమగ్రతకు, సర్వతోముకాభివృ ద్దికి అహర్నిశలు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడి గా సీనియర్ జర్నలిస్ట్, మెదక్ జిల్లా, రేగోడ్ మండలo ప్యారారం గ్రామానికి చెందిన తెనుగు నర్సింలు ముదిరాజ్ ను నియమించినట్లు దారం యువరాజ్ ముదిరాజ్ తెలిపారు. జాతి సేవలో విశిష్ట సేవలు అంధించగలరనే నమ్మకంతో మిమ్మల్ని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను సమీకరిస్తూ , తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంకిత భావం తో పని చేస్తూ, ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తానని తెనుగు నర్సింలు తెలిపారు.`