బోనకల్ లో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఘన స్వాగతం పలికిన మండల కాంగ్రెస్ నాయకులు

Published: Tuesday April 12, 2022
బోనకల్, ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి: మధిర శాసనసభ్యులు సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఏప్రిల్ 11న సోమవారం రోజున బోనకల్ మండల కేంద్రంలో ప్రవేశించి స్థానిక సాయిబాబా, దుర్గామాత ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కొనసాగించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పాదయాత్రకు ప్రతి గ్రామం, ప్రతి వార్డ్ నుంచి కుటుంబ సమేతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, సానుభూతిపరులు, వివిధ రాజకీయ అనుబంధ పార్టీల నాయకులూ సంఘీభావం తెలిపేందుకు అధిక సంఖ్యలో పాల్గొని భట్టి చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే గ్రామాల్లో రైతులు, కార్మికులు, మహిళలు, వృద్దులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటి రామకోటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు,గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.