నేటి జయంతి వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు ** ఎస్సీ సంక్షేమ శాఖ ఈడి సంజీవన్ **

Published: Friday April 14, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 13 (ప్రజాపాలన,ప్రతినిధి) : నేటి అంబేద్కర్132వ జయంతి వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఈడి సంజీవన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో అంబేద్కర్ సెంటర్ కమిటీ అధ్యక్షుడు బాపు జాడే తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం లుంబిని దీక్ష భూమి నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుండి వివేకానందు చౌక్ మీదుగా లుంబిని దీక్ష భూమి కొరకు ర్యాలీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు 500 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకలకు హాజరయ్యే వారికి భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రేగుంట కేశవ్, సెంటర్ కమిటీ కోశాధికారి సాంబయ్య, దుర్గం సుధాకర్, వైరగాడే పోశం, జాడి కృష్ణాజి, లీలరాణి, దీక్ష భూమి అధ్యక్షులు మనోహర్ లు పాల్గొన్నారు.