ప్రాథమిక వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం

Published: Thursday August 18, 2022

జన్నారం, ఆగస్టు 17, ప్రజాపాలన: ప్రాథమిక వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలమడుగు గ్రామానికి చెందిన మమ్మట్టి సంతోష్ కుమార్ స్థానిక రైతులు గ్రామస్థులు బుధవారం సన్మానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యిందని అన్నారు. గ్రామానికి తగిన విధంగా రైతులకు మార్కెట్ లో న్యాయం జరిగేలా అయన జరిపిస్తానన్నారు.  ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ముమ్మాటి సంతోష్ లను మంచిర్యాల జిల్లా ఏ.డి గజానంద్ ప్రమాణ స్వీకారం చేయించారని అయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.