రేణుక ఎల్లమ్మ పట్నాల వేడుకలలో పోచమ్మ బోనాలు

Published: Friday February 03, 2023

జన్నారం, ఫిబ్రవరి 02, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి గ్రామంలో  సోమవారం నిర్వహించే రేణుక ఎల్లమ్మ పట్నాలలో భాగంగ పోచమ్మ బోనాల పండుగ వేడుకలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగ మొదలైంది. ఈ సందర్భంగ గ్రామంలోని గౌడ కులస్తులు మహిళలు ఉదయం నుండే ఒక పొద్దులతో బోనాలు వండుకొని నెత్తిన ఎత్తుకొని బైండ్లోల్ల డబ్బు చప్పుళ్ళు వాయిద్యాలు ఎల్లమ్మ గదను ఎత్తుకొని నృత్యాలతో ఊరేగింపుగ పోచమ్మ ఆలయానికి బయలుదేరారు. సాయంత్రం వరకు ఆలయంలో పోచమ్మ తల్లికి బోనాలను నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక మొక్కలు తీర్చుకొంటారు. పోచమ్మ బోనాలతో గ్రామంలో పూర్తి ఆధ్యాత్మిక వాతావరనం నెలకొంది. ఈ కార్యక్రమంలో కనికరపు సత్య గౌడ్, మూల నారాయణ గౌడ్, చంద్ర గౌడ్, రవీందర్ గౌడ్, రాజు గౌడ్, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.