వ్యాక్సినే శ్రీరామరక్ష : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Tuesday June 15, 2021
జగిత్యాల, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వేల్లుతుందని ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతున్న వారిని సూపర్ స్పైడర్ గా గుర్తించి విడతల వారీగా వ్యాక్సిన్ ఇస్తోందని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక సంఘంలో గ్రామీణ వైద్యులు ఆర్ఎంపి పిఎంపిలను సూపర్ స్పైడర్ గా గుర్తిస్తూ వ్యాక్సినేషన్ ఇస్తుండగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రథమ చికిత్సలో వైద్యుల పాత్ర కీలకమని ఈ సమయంలో వారిని గుర్తిస్తూ వ్యాక్సినేషన్ ఇవ్వడంపై ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని డయాగ్నొస్టిక్ సెంటర్ తో పాటు ప్రభుత్వ వైద్యశాలలో అధునాతన వైద్యం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీదర్ జగిత్యాల నియోజకవర్గ మేడిపల్లి మండల్ ఆర్ఎంపీ పిఎంపి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.