కాంగ్రెస్ పార్టీలోకి నూతన చేరికలు

Published: Thursday May 19, 2022
జన్నారం రూరల్, మే 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కాంగ్రెస్ పార్టీలో నూతనంగా రైతు కూలీ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘంలో కొన్ని సంవత్సరాలు నుండి భాద్యతలు నిర్వహించిన మహమ్మద్ రహీం, మండల బీఎస్పీ పార్టీ లో గత సంవత్సరము నుండి మండల నాయకులుగా పదవి నిర్వహించిన నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని  మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్ , మండల ప్రధాన కార్యదర్శి ఫసిఉల్ల , పట్టణ అద్యక్షుడు దుమాల్ల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు, ఈ సందర్భంగా వారు బుదవారం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాజశేఖరరెడ్డి పాలనలో   కార్మికులకు, రైతులకు, కర్షకులకు, మేలు జరిగిందని, నేడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు జరుగుతుందని పూర్తి  నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ వుందని అన్నారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వచ్చి తీరుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు అంబడిపెల్లి మహేష్ , మండల కార్యదర్శి లకావత్ తిరుపతి,  వార్డ్ నెంబర్ గంగన్న యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు దుమ్మల ప్రవీణ్, బచ్చల శివ, తదితరులు పాల్గొన్నారు.