డిఈఈ సెట్ ప్రవేశాలకు దరఖాస్తుల పరిశీలన

Published: Wednesday February 01, 2023
 వికారాబాద్ డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె రామాచారి
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజా పాలన : ఉమ్మడి రంగారెడ్డి ,మేడ్చల్, వికరాబాద్ జిల్లాలలోని ప్రభుత్వ , ప్రైవేటు కళాశాలలలొ డి.ఈ.ఈ.సెట్ 2022 రెండు సంవత్సరముల కోర్సులో ప్రవేశాల కొరకు మూడవ విడతగా  ఫిబ్రవరి 3 న  డైట్ కాలేజీ వికారాబాద్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేసన్, 6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని , 14 న   సీట్లు కేటాయించడం జరుగుతుందని వికారాబాద్ డైట్ కళాశాల ఇన్ఛార్జి  ప్రిన్సిపాల్ కే రామాచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపినారు . 14 నుంచి 17 వరకు ఫీజు చెల్లించి  21లోగా అలాట్మెంట్ లెటర్ తొ ధృవపత్ర లను కళాశాలలొ సమర్పించి  రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపల్   కోరారు.