సిబ్బంది ఆరోగ్యమే ఆర్టిసి లక్ష్యం ఆర్టీసీ డిపో మేనేజర్ దేవదానం

Published: Wednesday November 23, 2022

మధిరనవంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధిఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ ప్రధాన లక్ష్యమని మధిర ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ దేవదానం పేర్కొన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు మధిర ఆర్టీసీ డిపో లో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ రూరల్ ఎస్సై నరేష్ ఏరియా ఆస్పత్రి వైద్యులు అనిల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా దేవదానం మాట్లాడుతూ 17 రకాల వైద్య పరీక్షలను ఆర్టీసీ ఉద్యోగులకు మూడు రోజులపాటు దశలవారీగా చేయటం జరుగుతుందన్నారు. డిపోలో పనిచేస్తున్న 248 ఆర్టీసీ ఉద్యోగులకు 50 మంది హయ్యర్  బస్ డ్రైవర్లకు ఉచిత వైద్య పరీక్షలు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుప్రియ పాల్గొన్నారు