అదుపుతప్పి బస్ టైరు కింద పడిన వ్యక్తి- నుజ్జు నుజ్జు అయిన కాలు ప్రజాపాలన విలేకరి శంకరపట్నం డ
Published: Friday December 23, 2022
కదులుతున్న బస్సు దిగే సమయంలో అదుపుతప్పిన హోంగార్డ్ కనకం రమేష్ కు కాలుకు తీవ్ర గాయాలు. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలం ఏరడపెళ్లి గ్రామానికి చెందిన కనకం రమేష్, కరీంనగర్ నుండి కేశవపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నా రమేష్ మార్గమధ్యంలో కేశవపట్నం అంబేద్కర్ కూడలి వద్ద బస్ దిగే సమయంలో అదుపుతప్పి రోడ్డుపై పడడంతో బస్ టైర్ అతని కాలుపై వెళ్లడం వలన కాలు నుజ్జు నుజ్జు అయింది, స్థానికులు 108కి ఫోన్ ద్వారా సమాచారం అందించగా 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొన ఈఎంటి ఎన్. శ్రీధర్, పైలట్ కె.వి రెడ్డి, వెంటనే స్పందించి గాయపడ్డ వారిని అంబులెన్స్ లోకి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు.
Share this on your social network: