డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెడ్ షర్ట్ వాలంటీర్ కవాతు శిక్షణ ఇచ్చిన డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర
బోనకల్ , డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలలో పాల్గొనే రెడ్ షర్ట్ వాలంటీర్లకు మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ శిక్షణ ఇచ్చారు. మండల వ్యాప్తంగా 40 మంది యువకులు ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బషీరుద్దీన్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 29వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభ సందర్భంగా రెడ్ షర్టు వాలంటీర్ల కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో యువతి, యువకులను ఎంపిక చేసి రెడ్ షర్ట్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణయంగా నిలవబోతున్నట్లు తెలిపారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుకు జిల్లా వ్యాప్తంగా యువత యువకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు,రెడ్ షర్టు వాలంటీర్ల మండల కన్వీనర్ గుగులోతు నరేష్ ,సిపిఎం నాయకులు జొన్నలగడ్డ సునీత, ఏడునూతల లక్ష్మణరావు, గండు సైదులు, కొంగర భూషియ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: