డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెడ్ షర్ట్ వాలంటీర్ కవాతు శిక్షణ ఇచ్చిన డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర

Published: Saturday December 24, 2022

బోనకల్ , డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలలో పాల్గొనే రెడ్ షర్ట్ వాలంటీర్లకు మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ శిక్షణ ఇచ్చారు. మండల వ్యాప్తంగా 40 మంది యువకులు ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బషీరుద్దీన్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 29వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభ సందర్భంగా రెడ్ షర్టు వాలంటీర్ల కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో యువతి, యువకులను ఎంపిక చేసి రెడ్ షర్ట్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణయంగా నిలవబోతున్నట్లు తెలిపారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుకు జిల్లా వ్యాప్తంగా యువత యువకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు,రెడ్ షర్టు వాలంటీర్ల మండల కన్వీనర్ గుగులోతు నరేష్ ,సిపిఎం నాయకులు జొన్నలగడ్డ సునీత, ఏడునూతల లక్ష్మణరావు, గండు సైదులు, కొంగర భూషియ్య తదితరులు పాల్గొన్నారు.