రంగస్థల కళాకారులను అభినందించిన ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క

Published: Friday April 16, 2021
మధిర, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజురంగస్థలం కళాకారులను ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కఅభినందించారు. ఇటీవల తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీలలో సుమిత్ర యూత్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన శ్రీ పాదుకా పట్టాభిషేకం నాటకానికి జాతీయ స్థాయి ప్రథమ బహుమతి వచ్చిన సందర్భంగా, శాసన సభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క సుమిత్ర యూత్ అసోసియేషన్సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాటక దర్శకులు డాక్టర్ శ్రీ నిభానుపూడి సుబ్బరాజు, చిలువేరు శాంతయ్య, బుచ్చి రామయ్య, ముత్త మాల వెంకటేశ్వరరావు, ముత్త మాల కృష్ణ, బి. రమేష్, అద్దంకి కృష్ణ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావుతదితరులు ఉన్నారు.