సిఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును అందచేసిన ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్

Published: Monday December 20, 2021

జగిత్యాల, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణం 27వ వార్డ్ ఇస్లాంపురాకి చెందిన మహమ్మద్ షాకీర్ హుస్సేన్ కి ఇటీవల శస్త్ర చికిత్స జరగగా ఎమ్మెల్యే  ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన (రూ.1,00,000/-) లక్ష రూపాయల విలువగల చెక్కును ఆదివారం వారి స్వగృహం నందు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్.సంజయ్ కుమార్ అందచేసినారు. సహాయం కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మొహమ్మద్ రజీవుద్దీన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నాయకులు హాబీబ్ జిలాని, మహమ్మద్ షకీల్, బోగ ప్రవీణ్, సమిండ్ల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి విజయ్, అల్లె సాగర్, మహమ్మద్ గౌస్, రషీద్, తదితరులు పాల్గొన్నారు.