ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Published: Friday April 23, 2021
మధిర, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మార్కెట్ కార్యాలయ ఆవరణంలో ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని తెలిపారు. మార్కెట్ పరిధి లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు, రావూరి శీను వినయ్ కుమార్ రైతులు పాల్గొన్నారు.