మత్స్యగిరి ఆలయంలో టెండర్లు
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నృసిoహ స్వామి దేవస్థానం గుట్టపైన మంగళవారం టెండర్ బహిరంగ వేలంలు నిర్వహించారు, 16.7.2021 నుండి 15.7.2022 వరకు 1 సంవత్సరము సీల్డ్ టెండర్/బహిరంగ వేలం ల్తెసెన్స్ రైట్ నిర్వహించుటకు 1. వాహన పూజ సామాన్ల్ అమ్ము కొనుటకు 7 లక్షల 03001 వేల రూపాయలకు మత్స్య గిరి గుట్ట కె నరేందర్, 2. కొబ్బరి చిప్పలు సమాకుర్చుకోనుటకు 4 లక్షల 51516 వేల రూపాయలకు. మత్స్య గిరి గుట్ట డి రవి కుమార్, 3. ఫోటో స్టూడియో నిర్వహించుకోనుటకు 79999 వేల రూపాయలకు వెంకటాపురం బి మదుకర్ యదవ్, 4. పూలు పూలదండలు అమ్ముకోను 1 లక్ష 20199 వేల రూపాయలకు భువనగిరి ఇ శ్రీధర్ పాట పాడి తీసుకున్నారు. మిగిలిన టెండర్ల వాయిదా పడినవి. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేందర్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.రవి కుమార్, ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ధర్మ కర్తలు, పాటదారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: