మత్స్యగిరి ఆలయంలో టెండర్లు

Published: Wednesday July 07, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నృసిoహ స్వామి దేవస్థానం గుట్టపైన మంగళవారం టెండర్ బహిరంగ వేలంలు నిర్వహించారు, 16.7.2021 నుండి 15.7.2022 వరకు 1 సంవత్సరము సీల్డ్ టెండర్/బహిరంగ వేలం ల్తెసెన్స్ రైట్ నిర్వహించుటకు 1. వాహన పూజ సామాన్ల్ అమ్ము కొనుటకు 7 లక్షల 03001 వేల రూపాయలకు మత్స్య గిరి గుట్ట కె నరేందర్, 2. కొబ్బరి చిప్పలు సమాకుర్చుకోనుటకు 4 లక్షల 51516 వేల రూపాయలకు. మత్స్య గిరి గుట్ట డి రవి కుమార్, 3. ఫోటో స్టూడియో నిర్వహించుకోనుటకు 79999 వేల రూపాయలకు వెంకటాపురం బి మదుకర్ యదవ్, 4. పూలు పూలదండలు అమ్ముకోను 1 లక్ష 20199 వేల రూపాయలకు భువనగిరి ఇ శ్రీధర్ పాట పాడి తీసుకున్నారు. మిగిలిన టెండర్ల వాయిదా పడినవి. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేందర్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.రవి కుమార్, ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ధర్మ కర్తలు, పాటదారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.