కొత్త కోర్టు మంజూరులో అభినందనలు తెలిపిన బార్ అసోసియేషన్ మధిర

Published: Wednesday February 15, 2023
ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోపురాతనమైన మధిర కోర్టు స్థానంలో కొత్త కోర్టు  భవనాలు నిర్మాణాల నిమిత్తం 21 కోట్లు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి. శ్రీనివాసరావు  మధిర బార అసోసియేషన్ సభ్యులు మరియు హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ కొల్లి సత్యనారాయణ ఈరోజు ఖమ్మం లో కలిసి అభినందించారుఈ సందర్భంగా న్యాయమూర్తి టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  సాధ్యమైనంత తొందరలో మధిరలో నూతన భవనాల్ని  అధునాతన సౌకర్యాలతో నిర్మించుకొని  కోర్టు కార్యకలాపాలు కొత్త భవనంలో నిర్వహించాలని ఈ  సందర్భంగా న్యాయమూర్తి  కోరారు. అందుకుగాను తన వంతు సహాయం చేస్తారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.