పి ఆర్ టి యు రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

Published: Tuesday October 19, 2021
యాదాద్రి అక్టోబర్ 18 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని గురునాథ్ పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోడ ఉపేందర్ పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోడ ఉపేందర్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, ధర్మారం వెంకటయ్య, జిల్లా కార్యదర్శి సోమ్లా నాయక్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ ఆనంద్, రవీందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సంఘం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.