ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్

Published: Thursday November 03, 2022

మధిర రూరల్ నవంబర్ 2 (ప్రజా పలన ప్రతినిధి) ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో  తన ఛాంబర్ లో జడ్పీ చైర్మన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుకి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ మంచినీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మడుపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు విద్యుత్ సమస్య పై అవార్డు కౌన్సిలర్లు జడ్పీ చైర్మన్ కు విన్నవించగా వెంటనే టౌన్ విద్యుత్ శాఖ అధికారులను పిలిచి వారితో మాట్లాడి వారం రోజుల్లోగా ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని ఖమ్మం డిఎం అండ్ హెచ్ ఓ మాలతితో ఫోన్లో మాట్లాడారు. ఈనెల 8వ తేదీన మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం రామభక్త సీతయ్య కళాపరిషత్ నిర్వాహకులు బాబ్ల పుతుంభాకా  శ్రీకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈనెల 15 మరియు 16 తేదీల్లో జరిగే బాలోత్సవ బ్రోచర్లను విడుదల చేశారు. చిరు వ్యాపారులకు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం సూపించిన స్థలంలో షాపులు ఏర్పాటు చేసే అంద చేయాలని చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుని కలసి వినతి పత్రం అందజేశారు.