రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న మెటుపల్లి జడ్పీటీసీ రాధ శ్రీనివ

Published: Monday June 27, 2022

మేట్ పల్లి, జూన్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల నియోజకవర్గంలో మెటుపల్లి మండల జడ్పీటీసీ రాధ శ్రీనివాస్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.తెరాస పార్టీ నుండి వచ్చిన జడ్పీటీసీ కి రేవంత్ రెడ్డి మరియు జువ్వాడి నర్సింగ్ రావు జువ్వాడి కృష్ణ రావు  కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన మెటుపల్లి మండల జడ్పీటీసీ రాధ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.