ఎమ్మార్వో చేతుల మీదుగా నూతన డైరీ ఆవిష్కరణ

Published: Friday March 05, 2021

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ 
ఆసిఫాబాద్ జిల్లా మార్చి04 (ప్రజాపాలన, ప్రతినిధి): కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ నూతన డైరీ ని జిల్లాలోని వాంకిడి ఎమ్మార్వో ఎం మధుకర్ చేతుల మీదుగా కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ కెవిపిఎస్ నిరంతరం దళిత పేద ప్రజల పక్షాన వారి హక్కుల కోసం కుల నిర్మూలన జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతుందని కొనియాడారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ కెవిపిఎస్ అంటరానితనం దళితులపై దాడులు అత్యాచారాలు, హత్యలు అరికట్టేందుకు సామాజిక ఆర్థిక సమానత్వం సాధన, కుల వివక్ష నిర్మూలనకై 1998 అక్టోబర్ 2న వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడిందని, నిరంతరం వారి హక్కుల కోసం పోరాడుతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి నేటి వరకు దళితులపైన దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత కుల నిర్మూలన కై పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రాథోడ్ బాబు సింగ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, ఉపాధ్యాయులు దుర్గం రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.