పీర్జాదిగూడలో ఆర్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

Published: Monday June 28, 2021
మేడిపల్లి, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : శారీరిక దృఢత్వంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి జిమ్ లు దోహదపడతాయని కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. పీర్జాదిగూడ ప్రధాన రహదారిలో హెచ్ పి పెట్రోల్ పంపు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్ హాజరై బోడుప్పల్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ తో కలిసి జిమ్ ను  ప్రారంభించారు. జిమ్ లో అధునాతన పరికరాలతో అనుభవం కలిగిన వారితో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఆర్ చందు, తరుణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్  కౌడే పోతయ్య, పీర్జాదిగూడ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, రాసాల నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.