ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *ప్రగతి నివేదన యాత్ర జయప్రదం చేయండి*
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను గ్రామ గ్రామాన వివరించేందుకు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈనెల 22 1 2023 నందివనపర్తి గ్రామం నుండి పాదయాత్ర చేయడం జరుగుతుంది, కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ దిశా నిర్దేశంలో ఇబ్రహీంపట్నం అభివృద్ధి అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి సాధ్యమని పల్లె పల్లె ను దాటి గడపగడపకు వెళ్లి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలియజేస్తూ, సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైన వాటికి అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ, ప్రతి అక్క అన్న,చెల్లి తమ్ముడి గుండె గుండెను పులకరింపజేస్తూ మన ప్రశాంత్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పాదయాత్ర చేస్తున్నాడు, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొంటారు కావున ఇబ్రహీంపట్నం మండల పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు , బి ఆర్ ఎస్ వి . బిఆర్ఎస్ వై సభ్యులు, మహిళ నాయకులు, యువతి యువకులు, బంటీ యూత్ ఫోర్స్ సబ్యులు భారీ ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.
Share this on your social network: