పంచాయతీ కార్యాలయం నందు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం

Published: Wednesday October 13, 2021
బోనకల్,అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలోఈరోజు మొదటి వ్యాక్సిన్ వేయించు కోని వారికి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కరోనా వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతు గ్రామంలో ప్రతి ఒక్కరూ కరోనా మొదటి వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలి. దానికోసం ఇంటిలో 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించు కోవాలని సూచించడం జరిగింది. మొదటి వ్యాక్సిన్ పూర్తి చేసుకోని రేండవ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అటువంటివారు ఎవ్వరైనా ఉంటే ఈ రోజు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి పరశురామ్, ఆశా కార్యకర్తలు కళావతి, రత్నకుమారి, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.