చికిత్స పొందు వ్యక్తి మృతి.

Published: Wednesday May 26, 2021
పరిగి, మే 25, ప్రజాపాలన ప్రతినిధి : క్రిమిసంహారక మందు సేవించి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా, మండల పరిధిలోని బట్ల సందరం గ్రామంలో చోటు చేసుకొంది. ఎసై రాజు తెలిపిన వివరాల ప్రకారం బట్ల సందరం గ్రామానికి చెందిన మేదరి రాఘవేందర్ (22) తండ్రి రాములు చేసిన అప్పు ఎలా తీర్చాలని మనస్థాపానికి లోనై క్రిమిసంహారక మందు సేవించి ఈనెల 20న క్రిమిసంహారక మందు సేవించాడు. ఉన్నత వైద్యం కోసం నగరంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతు మంగళవారం మృతి చెందాడు. మృతడు తండ్రి రాములు పిర్యాదు మేరకు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.