డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి వేడుకలు

Published: Wednesday April 06, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి : కందుకూరు మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 114 జయంతి ఘనంగా నిర్వహించారు కందుకూరు ఎంపీపీ మంద జ్యోతి పాండు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళితులకు ఎంతో తోడ్పాటు అందించారని స్వాతంత్ర సమరయోధుడు దేశానికి పేరు ప్రఖ్యాతులు అందించిన ఘనత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దక్కిందని జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పెద్ద రామయ్య, ఎగిరి సత్య, మాదాపూర్ సర్పంచ్ మంద సాయిలు, సిపిఎం మండల కార్యదర్శి చందు, మంద నరసింహ, బుడ్డోడిని నరసింహ, మధుకర్, నవీన్, శ్రీనివాస్, అనిల్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అశోక్, తదితరులు పాల్గొన్నారు.