ఒక మంచి ఆలోచన లక్షల మందిని చైతన్యం వైపు కదిలిస్తుంది

Published: Monday July 19, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ 18 జూలై ప్రజాపాలన బ్యూరో : సేవ చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి సత్యభారతి ఫంక్షన్ హాల్ లో జరిగిన యజ్ఞ పౌండేషన్ వారి 14వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి, కోవిడ్ రక్ష, అద్వైతచేతన మరియు అన్న యజ్ఞ కార్యక్రమాలను వేదిక పై నుంచి ప్రారంభించారు. అలాంటి వారందరిని ఒకే వేదిక పైకి తీసుకొని వచ్చి ఎంతో గొప్పగా సేవ చేస్తున్న యజ్ఞ ఫౌండేషన్ వారిని అభినందించారు. అన్ని రంగాలలో యజ్ఞ ఫౌండేషన్ వారు ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. విద్య, వైద్యం, మెడిటేషన్ సెంటర్, లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మొదలయినవి ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ చిగుళ్ళపల్లి పర్సన్ మంజుల రమేష్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ముత్తాహర్ షరీఫ్, పౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, పౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ యుుజ్వల్ రాజ్, ట్రెజరర్ డాక్టర్ చంద్రశేఖర్, సెక్రెటరీ డాక్టర్ వంశీ, ప్రిన్సిపల్ అనురాధ, దాతలు సురేష్, అనితా రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.