పోరాటంతోనే బడుగు, బలహీన వర్గాలకు అధికారం : భారతీయ మౌనజాతుల ప్రజాసమితి. హైదరాబాద్ (ప్రజాపాలన

Published: Wednesday April 12, 2023

 మన హక్కులు మనం సాధించుకోవడం కోసం భిక్షం ఎత్తాల్సిన అవసరం లేదని,మహాత్మా జ్యోతిరావు పూలే చూపించిన బాటలో పోరాడి సాధించుకోవాలని అన్నారు భారతీయ మౌనజాతుల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు ముస్త్యాల రామచంద్రం.మహాత్మా జ్యోతిరావు పూలే 197 వ జయంతిని పురస్కరించుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలైన బడుగు, బలహీన వర్గాలు స్వాతంత్ర్యం రాకముందు ఎలా వున్నారో నేటికీ అదే దీనపరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ వర్గాల కోసం నూతనంగా మన రాష్ట్రంలో భారతీయ మౌనజాతుల ప్రజాసమితి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశామన్నారు. మహనీయులు పూలే, అంబేద్కర్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్, అబ్దుల్ కలాం ల ఆలోచన, ఆశయాల స్ఫూర్తియే తమ పార్టీ విధానం అని అన్నారు. బహుజనులందరి బాగోగులు, రాజకీయ అధికారం, సామాజిక న్యాయం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు భారతీయ మౌనజాతుల ప్రజాసమితి కార్యవర్గం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.