ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో

Published: Friday July 29, 2022
ప్రైవేట్ కంపెనీ కి చెందిన వరి విత్తనాలు కొనుగోలు చేసి మొలకలు రాక మోసపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ తల్లాడ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ సీడ్స్ విత్తన దుకాణంలో అన్నారు గూడెం గ్రామానికి చెందిన రైతులు గోదావరి సీడ్స్ సంబంధించిన వరి విత్తనాలను కొనుగోలు చేసి పంట పొలాల్లో చల్లిన విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు విత్తన దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆపద రామారావు రైతుసంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు