ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి *జిల్లా మహాసభలను జయప్రదం చేయండి* టియుడబ్ల్
రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని గురువారం రోజు నగరంలోని బాలాపూర్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరించబోతున్నామని హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రభుత్వంతో మాట్లాడారని త్వరలోనే జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు ఇండ్ల స్థలాల సమస్యలు హెల్త్ కార్డుల సమస్యలు లాంటివన్నీ పరిష్కారం కాబోతున్నాయని అన్నారు జనవరి 8 9 10 వ తేదీలలో నిర్వహించే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈనెల 17వ తేదీన జిల్లా మహాసభలను నిర్వహించనున్నామని తెలిపారు అందులో భాగంగానే టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు రంగారెడ్డి జిల్లాలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీయూడబ్ల్యూజే జిల్లా జాయింట్ సెక్రెటరీ డి హరికృష్ణ రెడ్డికి తొలి సభ్యత్వం అందించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ సభ్యత్వాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, జిల్లా జాయింట్ సెక్రటరీలు డి హరికృష్ణ రెడ్డి, చెరుకూరి మహేందర్, జిల్లా కోశాధికారి చెరుకూరి రాజు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చెరుకూరి మహేందర్, తెంజు నియోజకవర్గ అధ్యక్షులు పి.వెంకటేష్, ట్రెజరరీ పి.సుదర్శన్, సురేందర్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: