మన ఊరు - మన బడి కార్యక్రమంలో పాఠశాలను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

Published: Thursday February 02, 2023
*మన ఊరు - మన బడి కార్యక్రమంలో పాఠశాలను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ..*
 
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కు మాత్రమే దక్కుతుందని,విద్యార్థులకు నాణ్యమైన విద్య,ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అయన అన్నారు,ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య,స్థానిక మున్సిపల్ కమిషనర్,మున్సిపల్ ఛైర్మెన్,వైస్ చైర్మన్,కౌన్సిలర్లు,కో-ఆప్షన్ మెంబర్లు,బీ.అర్.ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు,పాఠశాల విద్యార్థులు,ఉపాద్యాయులు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ..