అపార్ట్మెంట్ వాసులకు సహాయ సహకారాలు అందించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

Published: Friday September 30, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీ సాయినగర్ కాలనీలోని ''అనురాధ సి బ్లాక్''అపార్ట్మెంట్ సెల్లర్ లోకి వరద నీరు చేరడంతో సెల్లర్ లోని ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్ పూర్తిగా మునిగిపోవడంతో కరెంటు, వాటర్ లేక  అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి  దగ్గరుండి మున్సిపల్ మన్సూన్ టీమ్ రెండు మోటర్ల సహాయంతో సెల్లర్ లోని వరద నీటిని తొలగించారు. అనంతరం కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి కంప్రెషర్ తో విద్యుత్ మీటర్ లను తడిగా లేకుంటా చేసి విద్యుత్ అధికారులు,ఎలక్ట్రిషన్ను పిలిపించి పవర్ సప్లై, వాటర్ సప్లై వచ్చే విధంగా చేశారు.రెండు రోజులుగా  అపార్ట్మెంట్ వాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి కావల్సిన సహాయ,సహకారాలు అందించిన కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డికిి అపార్ట్మెంట్ వాసులు  ధన్యవాదాలు తెలియజేశారు.