హుజురాబాద్లో రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడోయాత్ర
Published: Thursday March 02, 2023
హుజూరాబాద్ మార్చి01 ప్రజాపాలన రిపోర్టర్:
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్సే హాత్ జోడోయాత్రలో భాగంగా బుధవారం హుజురాబాద్ కు చేరుకున్నాడు. హుజురాబాద్ మండలం ఇందిరా నగర్ గ్రామం నుంచి బుధవారం సాయంత్రం మొదలుపెట్టిన యాత్ర యాత్రలో పలు గ్రామాల్లో ఇందిరానగర్, శాలపల్లి, చెల్పూర్, రాజపల్లి, రంగాపూర్ మీదుగా హుజురాబాద్ చేరుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు హారతులతో స్వాగతం పలికి జోడోయాత్రకు మద్దతు ఆయన వెంట హుజురాబాద్ వరకు నడిచారు. ఆయన వెంట మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ రమణారావు, మాజీ షాప్ చైర్మన్ మక్కాన్ సింగ్ తదితరులు ఆయన వెంట పాదయాత్ర చేశారు.
Share this on your social network: