చిల్కానగర్ డివిజన్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Saturday January 28, 2023
మేడిపల్లి, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి) 
చిల్కానగర్ డివిజన్లో అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి   ప్రారంభించారు.బీరప్పగడ్డలోని న్యూ ప్రశాంత్ నగర్ బస్తీ, సౌత్ ప్రశాంత్ నగర్, చిల్కానగర్లోని బ్రహ్మంగారి గుట్ట వీధి, న్యూ రాంనగర్ శివాలయం వద్ద స్ట్రాంగ్ వాటర్ లైన్, నూతన సీసీ రోడ్లు నిర్మాణ పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల్ల కొండల్ రెడ్డి,వి బి నరసింహ, కొక్కొండ జగన్, రామానుజన్, మహమూద్, అల్లిబిల్లి మహేందర్, బింగి శ్రీనివాస్, రామ్ చందర్, రవీందర్ గౌడ్ ,యాదగిరి, గూడూరి రమేష్, సుందర్, శ్రీనివాస్ యాదవ్, బాలేందర్, రమేష్ ,సదానంద చారి ,ఫోటో బాలు, జిల్లాల ప్రవీణ్, నరేష్ ,బీరప్ప గడ్డ బాలు, శ్యామ్, మహిళా నాయకురాలు  సుభద్ర, సరిత, సైనజ్, ఆండాలు ,లక్ష్మి ,సత్యవతి , ఉమా ,అంజలి, కనకతార, ఆయా కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.