పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి : ఎమ్మెల్యే మంచిరెడ్డి

Published: Wednesday October 06, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే ముఖ్యమంత్రి సహాయనిధి లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అన్నారు.. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. కప్పపహాడ్ గ్రామానికి చెందిన చాతల శిల్పకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (CMRF) కింద మంజూరైన రూపాయలు 30,000 చెక్కును ఆమె తండ్రి బిక్షపతికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, సర్పంచ్ సామల హంసమ్మ యాదగిరి రెడ్డి, ఉపసర్పంచులు ఎండి. మునీర్, ఏనుగు నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జెలందర్, మాజీ అధ్యక్షుడు శంకరయ్య, నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.