అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: సిపిఎం బోనకల్ గ్రామ శాఖ నిర్మాణ పనులన

Published: Friday July 29, 2022

బోనకల్, జులై 28 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఆళ్లపాడు రోడ్డులో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను సీపీఎం నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సంవత్సరం పూర్తయిన్పటికీ ఇంతవరకు పూర్తి నిర్మాణం కాలేదని వాహన దారులు ,రైతులు అటుగా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని, కావున నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, వర్షం వచ్చినపుడు నీళ్లు బ్రిడ్జి మధ్యలో నిల్వకుండా వెంటనే నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని,వానా కాలంలో గ్రామంలో కురిసే నీళ్లు మొత్తం బ్రిడ్జి నుండే వెళ్తాయని ఆ వర్షపు నీళ్లు వెళ్లుటకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాలువ ఏర్పాటు చేయాలని బ్రిడ్జి సైట్ ఇంజినీర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస్, పార్టీ నాయకులు భూక్య జాలు,చెన్నా లక్షాద్రి, వార్డునెంబర్ ఉప్పర శ్రీను, సైట్ ఇంజినీర్ అప్పారావు పాల్గొన్నారు.