డయల్ యువర్ చైర్ పర్సన్ కు 20 ఫిర్యాదులు

Published: Tuesday February 21, 2023
* వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 20 ఫిబ్రవరి ప్రజాపాలన : డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంతో అనేక సమస్యలు  పరిష్కరిస్తున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. సోమవారం చైర్ పర్సన్ ఛాంబర్ లో డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి 20 ఫిర్యాదులు వచ్చినవని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రారంభం నుండి రెగ్యులర్ గా డ్రైనేజీలు పొంగిపొర్లడం, రోడ్లపై గుంతలు, చెత్త బండి రాకపోవడం, లాంటి ఫిర్యాదులు పునరావృతం అవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రతి విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది దగ్గర నుండి క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, గతవారం వచ్చిన సమస్యలు మళ్లీ పునరావృత్తం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతందని వివరించారు. వచ్చిన 20 ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.