దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య
Published: Wednesday December 08, 2021
మధిర డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధిధి : మధిర మండల పరిధిలోని దెందుకూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈరోజు ఖమ్మం జిల్లా వైద్య శాఖ అధికారి ఎస్.యాదయ్య సందర్శించారు. పాఠశాల ఆవరణలోని టాయిలెట్స్ నిర్వహణ పట్ల, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పట్ల, సంతృప్తి చెంది, పి .డీ సృజన దగ్గరుండి వంట చేస్తున్నందుకు ఆమెను అభినందించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణదాసు, తదితర ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సి.యల్.ఎస్ ఉన్నపటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలని విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమని తదితర అంశాల పై పలు సూచనలు సలహాలు చేశారు
Share this on your social network: