పదవ తరగతి ప్రత్యేక తరగతుల కొరకు విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు

Published: Tuesday January 24, 2023
బోనకల్ జనవరి 23 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ముష్టికుంట ఉన్నత పాఠశాలలో
పదవ తరగతి విద్యార్థుల కొరకు వితరణగా ఈ పాఠశాల పూర్వ విద్యార్థి గుడ్డు సహేజ్ తండ్రి హుస్సేన్ సహేబ్, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జరిగినంత కాలము 10వ తరగతి పరీక్షల వరకు విద్యార్థులకు, "అల్ప ఆహారము'ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమమునకు మండల ఎంపీడీవో బోడేపూడి వేణు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి, ముష్టికుంట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలపతిరావు అద్యక్షత ప్రారంభించినారు.ఈ కార్యక్రమములో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లి తండ్రులు, పాఠశాల ఉపాద్యాయులు పాల్గోన్నారు.