ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ గణనాధుని లడ్డును రత్లవత్ బ్రదర్స్ (1.25) దక్కించుకున్నారు

Published: Wednesday September 22, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : చింతలకుంట లో ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని నవరాత్రులు భక్తిశ్రద్ధలతో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు అందరూ కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తగణం వీడ్కోలు ఘట్టన్నాని చరవాణి లో బంద్స్తుండగా తల్లి ఒడికి తరలుతున్న సందర్భంలో లడ్డు వేలం పాట లో పాల్గొన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఆ గణనాథుని లడ్డు వేలం పాటలో పోటీపోటీగా రత్లవత్ రాజు వారి అన్న తనయులు అయినటువంటి బ్రదర్స్ ఒక లక్షా 25 వేల ఒక్క రూపాయికు పవిత్రమైన లడ్డు ను కైవసం చేసుకున్నారు. గత 2019 సం.లో సుభాన్ నాయక్ 60 వేలకు దక్కించుకున్నారు. ఈ ఏడాది వేలం పాటలు లడ్డు (1,25,001) పోటాపోటీగా లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... ఈ ఏడాది లడ్డు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారికి బహుమానంగా ఇచ్చిన కిరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి శాలువాతో సన్మానించి లడ్డు ప్రసాదాన్ని రత్లవత్ బ్రదర్స్ కు అందజేశారు. అనంతరం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారికి పూర్తి సహకారాలు అందించిన సాయిబాబా, కిషోర్, రాజేష్ వారి మిత్రులు అందించి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, చింతలకుంట ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.